- Advertisement -
మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్
నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మానవుల మనుగడ కోసం, పచ్చదనం, పరిశుభ్రత వెలిసేలా మొక్కలు నాటలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -