ఎన్ పిఆర్ డి వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కుర్మయ్య
నవతెలంగాణ – తిమ్మాజిపేట : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలోని వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్.పిఆర్.డి. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కుర్మయ్య పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు పెంచి పెండింగ్ లో ఉన్న పెన్షన్లను మంజూరు చేయాలని, వికలాంగుల కార్పొరేషన్ ను బలోపేతం చేయాలని మూసివేసిన టీసీపీసీ సెంటర్లను ప్రారంభించాలని కోరుతూ జులై 17న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, ధర్మయ్య, సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES