నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్లో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థకు రూ.10 కోట్లు ఇప్పిస్తామంటూ టోకరా వేశారు. రూ.15 లక్షలు కమీషన్ తీసుకుని భరత్రెడ్డి అనే వ్యక్తి అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు అమరేంద్ర పీఎస్లో ఫిర్యాదు చేశారు. గుంటూరులో అమరేంద్ర రూరల్ హెల్త్ సొసైటీ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.