- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని హెచ్ఎం డాక్టర్ ఎండీ.సాదత్ అలీ అన్నారు. ఇదే వార్డుకు చెందిన సుతారి సుష్మ – సందీప్ దంపతుల కుమార్తె వేదాన్వి జన్మదినం సందర్భంగా.. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట జెడ్ పీహెచ్ఎస్ లో పలువురు పేద విద్యార్థులకు రూ.5 వేల విలువైన స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ.. జన్మదిన వేడుకల్ని ఆర్భాటాలతో కాకుండా ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం అభినందనీయమన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
- Advertisement -