- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహం విజయవాడలో జరింగింది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రత్యేక అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,ఆర్మూర్ ఏబి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు.
- Advertisement -