- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో రిటైర్డ్ టీచర్ పట్టేపూర్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వారి కుమారుడు సతీష్ రెడ్డి విద్యార్థులకు టై , బెల్టుల ను గురువారం పంపిణీ చేశారు. 250 మంది విద్యార్థిని విద్యార్థులకు 25వేల రూపాయల విలువచేసే ఐడి కార్డ్స్, టై ,బెల్టు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల పరిషత్ ప్రధానోపాధ్యాయులు గోపిడి రమణారెడ్డి, రామ్మోహన్ , విశ్రాంత ఉపాధ్యాయులు రామచందర్ , కండెల భరత్ కుమార్ , శ్రావణ్ రెడ్డి నవీన్,ఎడ్ల సురేష్,విద్యార్థిని ,విద్యార్థులు, పాల్గొన్నారు.
- Advertisement -