- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్ లో గురువారం పీజీ నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాన్ని పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్ పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ కు సూచించారు. మొత్తం 171 విద్యార్థులకు గాను 169 విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
- Advertisement -