- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ తెలిపారు. గురువారం భిక్కనూరు పట్టణ కేంద్రంలో ద్విచక్ర వాహనంపై తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో హర్ ఘర్ తిరంగా క్రమంలో భాగంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేసి భారతదేశ ఐక్యతను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బసవ రెడ్డి, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, నాయకులు రాజయ్య, విలాస్ రెడ్డి, నర్సారెడ్డి, మహేందర్ రెడ్డి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -