- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు చేతి గాజులను ఒక్కరికొక్కరు వేసుకున్నారు. చిన్నారులు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంజా ఎక్కి ఉట్టిని కొట్టారు. గ్రామంలోని ప్రధాన విదుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలోనే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యాదవ సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -