Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ముధోల్ కు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు: ఎమ్మెల్యే           ...

ముధోల్ కు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు: ఎమ్మెల్యే                                   

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ ‌
ముధోల్ లో 45.15 కోట్ల రూపాయల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మంగళవారం ఒక్క ప్రకటనలో తెలిపారు. గతం లో ఇక్కడ ఐటిఐ కళశాల ( టెక్నాలజీ సెంటర్ )మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి ని కోరడంతో పాటు, అసెంబ్లీలో ప్రస్తావించడంతో ముధోల్ లో ఎటిసి. సెంటర్ ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు‌. ‌ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందన్నారు. కార్మిక, ఉపాధి కల్పన ఆధ్వర్యంలో టాటా టెక్నాలజీ  భాగస్వామ్యంతో కేంద్రం కొనసాగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు,నిరుద్యోగ యువత  శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారన్నారు. 45 కోట్ల నిధులతో భవన నిర్మాణాలు, యంత్రాలు, కంప్యూటర్ లు, ఇతరత్ర సౌకర్యాలు  కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి టాటా కంపెనికి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad