Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు అవగాహన కార్యక్రమం 

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వందరోజుల కార్యక్రమంలో భాగంగా అవగాహన టూర్ 80వ రోజు సర్కిల్ ఒకటి, డివిజన్ ఒకటి విజ్ఞాన్ హై స్కూల్ పాఠశాలలో చదువుతున్న 8, 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మురుగు నీటి శుద్ది కేంద్రం (ఎస్ టి పి) ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి, ఇంటి వ్యర్థాలను తడి, పొడి , ప్రమాదకరమైన వర్గాలుగా విభజించడం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సరైన వ్యర్థాలను వేరు చేయడం, మున్సిపల్ సేకరణ వాహనాలకు చెత్తను అప్పగిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సర్ రవి బాబు, సర్కిల్  1 ఎస్‌ఐ ప్రశాంత్ , మున్సిపల్ జవాన్లు, ఎం ఐ ఎస్ ఆపరేటర్  శివరంజని, స్కూల్ ప్రిన్సిపల్ , ఉపాధ్యాయులు , స్కూల్ స్టూడెంట్స్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad