– ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకర బోయిన మహేష్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పల్లె బాట కార్యక్రమంతో ముదిరాజుల సమస్యల పరిష్కారం కోసం ముదిరాజ్ పోరాట సమితి ముందుకు వెళుతుందని ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకర బోయిన మహేష్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ముదిరాజ్, మత్స్యకారుల సమస్యల పై గ్రామీణ ముదిరాజ్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. మన హక్కుల సాధన కొరకు ఉద్యమించాలని, ముదిరాజులకు అండగా నీల మధు ముదిరాజ్ ఉంటారని నాయకులకు భరోసాని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పర వేణి రంజిత్, రాష్ట్ర కార్యదర్శి జనవేణి శ్రీనివాస్ ,పెసరు కుమారస్వామి, అట్టెం రమేష్, కరుణాకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చెంది శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.