- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి జి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ స్థాయిలోని అందరూ గ్రామ ఉద్యోగులు,సింగిల్ విండో చైర్మెన్ గారు,వివిధ రాజకీయ పార్టీ నాయకులు వ్యాపారస్తులు ప్రజలు హాజరయ్యి, గ్రామసభను విజయవంతం చేయగలరని కోరారు.
- Advertisement -