Thursday, September 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎస్‌సిఓ నిజమైన ప్రత్యామ్నాయం!

పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎస్‌సిఓ నిజమైన ప్రత్యామ్నాయం!

- Advertisement -

షాంగై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశాలు 2025 ఆగస్టు 31 నుండి సెప్టెంబర్‌ ఒకటి వరకు చైనాలోని టియాంజిన్‌ అనే నగరంలో జరిగాయి. ఈ సమావేశాలకు ఇరవై దేశాలకు చెందిన నాయకులు పది అంతర్జాతీయ సంస్థలు, పరిశీలన దేశాలు, చర్చల భాగస్వాములు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌, అంతర్జాతీయ సంస్థల నాయకులు పాల్గొన్నారు. ఎస్‌సిఓ 2001లో చైనాలోని హువాంగ్పు నది ఒడ్డున ఏర్పడింది. నిజమైన బహుళ ధృవ ప్రపంచం, సరిహద్దు భద్రత సమస్యల పరిష్కారం, పరస్పర విశ్వాసం, పరస్పర ప్రయోజనం, సమానత్వం సంప్రదింపులు, విభిన్న నాగరికతల వైవిధ్యం పట్ల గౌరవం, ఉమ్మడి అభివృద్ధి సాధన అనే షాంగై స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఎస్‌సిఓ ఆరు సభ్యదేశాల నుండి పది దేశాలు, రెండు పరిశీలక దేశాలు, 14 సంభాషణ భాగస్వామ్య దేశాలతో ఒక పెద్ద ప్రాంతీయ అంతర్జాతీయ, భూ భౌగోళిక, భారీ జనాభా కలిగిన నేటి ప్రపంచంలో పెద్ద కుటుంబంగా ఏర్పడింది.

నేటికీ కొన్ని పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగా బహు పాక్షిక యంత్రాంగాలను, దేశాలను అణగదొక్కుతున్నాయి. దానికి భిన్నంగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఎస్‌సిఓ కృషి చేస్తుంది. దీని శిఖరాగ్ర సమావేశం, రెండో ప్రపంచ యుద్ధంలో జపనీస్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజల ప్రతిఘటన యుద్ధం, ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధం యొక్క 80వ వార్షికోత్సవం ఒకే చారిత్రాత్మక క్షణంలో జరుగుతున్నాయి. ఎస్‌సిఓ బహుళ ధ్రువ ప్రపంచ క్రమానికి వారసత్వంగా, పశ్చిమ దేశాల తరహా ఆదిపత్య క్రమాన్ని అభివృద్ధి చేయడం కాకుండా, కొత్త పరిస్థితులలో నేటి బహుముఖ దేశీయ ప్రపంచ ప్రజల అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మాణం లక్ష్యంగా, ఎస్‌సిఓ ఒక బలమైన రక్షకుడిగా, నిజమైన బహుళ ధ్రువ ప్రపంచ ప్రజల ప్రయోజనాలే గీటురాయిగా పనిచేస్తుంది. టెర్రరిజం, వేర్పాటువాదం, భద్రత మరియు ఆర్థిక సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఎనర్జీ, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ఆధునిక వ్యవసాయం, పర్యావరణహిత అభివృద్ధి, నిజమైన ఉమ్మడి దేశాల ప్రయోజనం, వాటి అనుసంధానం, దేశాల మధ్య భాగస్వామ్య భవిష్యత్తు లక్ష్యంగా పని చేస్తుంది.

నేటి అత్యంత సంఘర్షణతో కూడిన సంక్లిష్ట ప్రపంచంలో, ఈ సుదీర్ఘ క్రమంలో ఎస్‌సిఓ సభ్య దేశాల మధ్య అద్భుతమైన యంత్రాంగం ఏర్పడింది. స్థిరమైన అభివృద్ధిని, సమృద్ధిగా సహకార అవకాశాలను సఅష్టించింది. ఎస్‌సిఓ సభ్య, పరిశీలక, సంభాషణ భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం 890.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది చైనా మొత్తం విదేశీ వాణిజ్యంలో 14.4 శాతానికి సమానం. కజకిస్తాన్‌లో మూడు అత్యాధునిక వర్క్‌షాప్‌లు ప్రారంభించ బడ్డాయి. అత్యాధునిక వ్యవసాయ అభివృద్ధి పథకాలు ప్రారంభించబడ్డాయి. అనేక దేశాల మధ్య పరస్పర శ్రేయస్సు, సంఘీభావం, సహకారమే నేటి తీవ్ర సంఘర్షణ, సంక్లిష్టతలతో కూడిన ప్రపంచ సవాళ్లకు సరైన సమాధానం అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. నేడు ఏక ధ్రువ నియంతృత్వ ఆదిపత్యం, రక్షణవాద ధోరణులు తీవ్రంగా పెరుగుతున్నాయి. శాంతి అభివృద్ధి, ప్రజాహిత పరిపాలన పూర్తిగా లోపిస్తున్నాయి. ఎస్‌సిఓ దేశాలు సగం ప్రపంచ జనాభాను కలిగి ఉన్నాయి. నాలుగింట్లో ఒక వంతు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. వీరి మధ్య ఐక్యత సహకారాన్ని బలోపేతం చేయాలి. భాగస్వామ్య భవిష్యత్తు, మరింత సన్నిహితంగా ఉండే సమాజాన్ని ప్రోత్సహించాలి. ఇది వారి సొంత అభివఅద్ధికి ప్రాంతీయ భద్రతకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు ప్రపంచ స్థిరత్వానికి దోహదం చేస్తుంది. భారత్‌పై ట్రంప్‌ చేస్తున్న తీవ్రమైన అమెరికా స్వప్రయోజన వాణిజ్య యుద్ధం, భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. భారత ప్రజలపై ట్రంప్‌ చేస్తున్న వాణిజ్యయుద్ధాన్ని, భారత్‌కు మేము తోడుగా ఉన్నామని ఖండించింది చైనా రష్యాలు మాత్రమే. ఈ నేపథ్యంలో 145 కోట్ల భారత్‌కు నిజమైన స్నేహితులు చైనా రష్యాలే అని నిజమవుతుంది.

ఈ క్రమంలో పశ్చిమ యూరోప్‌లోని అనేక దేశాలు, నాటు సెక్రటరీ జనరల్‌, అమెరికా లాగే భారత్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. చైనా ఇండియాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలు, ఆర్థికంగా ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో స్వభావికంగా అనేక విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్న చైనా-ఇండియాల మధ్య సంఘర్షణ కంటే సహకారానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రెండు అతి పెద్ద ఆర్థిక శక్తులు దగ్గర కావడం ఇష్టం లేని పశ్చిమ దేశాలు అమెరికాలకు తీవ్ర కడుపుమంటే. ఎస్‌సిఓ సమ్మిట్‌ అమెరికా పశ్చిమ దేశాల ఆధిపత్య ప్రపంచక్రమానికి బదులుగా బహుళ ధ్రువ సహకారం ద్వారా ఒక నూతన విలువలతో కూడిన ప్రపంచ క్రమాన్ని నిర్మించడమే. ప్రపంచ మానవాళి యుద్ధము శాంతి మధ్య, సంఘర్షణ సంభాషణల మధ్య, పరస్పర సహకారం, ఒకరు గెలిచి, మరొకరు ఎస్‌సిఓ సమ్మిట్‌ , దాన్ని అనుసరించే జరిగిన జపాన్‌ ఫాసిస్ట్‌ దురాక్రమణ వ్యతిరేక, చైనా ప్రజల ప్రతిఘటన యుద్ధం విజయోత్సవ 80వ వార్షికోత్సవం జరిగింది. అనేక దేశాలు ఈ సైనిక కవాతులో పాల్గొన్నాయి. ముఖ్యంగా చైనా జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ పక్క పక్కనే పాల్గొనడం కీలకమైన విషయం. ఈ మూడు శక్తివంతమైన న్యూక్లియర్‌ పవర్స్‌.

అమెరికా పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన కూటమి వెలిసింది. షిజిన్‌పింగ్‌, పుతిన్‌, కిమ్‌ ముగ్గురు నాయకులు కలిసి ఒకే వేదికపై ప్రపంచ ఫ్యాసిజాన్ని ఓడించిన సైనిక కవాతులో కనిపించడం వల్ల ప్రపంచ ప్రజల నిజమైన ప్రత్యామ్నాయం ఆవిష్కృతం అయిందా అన్నట్లుగా ఉంది. అమెరికా, పశ్చిమ దేశాల ప్రపంచ ఆధిపత్యానికి భిన్నంగా నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. డోనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో చాలా వ్యంగ్యంగా పోస్ట్‌ చేస్తూ.. మనం భారతదేశం, రష్యాలను లోతైన, చీకటి చైనా చేతిలో కోల్పోయినట్లు కనిపిస్తోంది.. వారందరికీ సుదీర్ఘమైన మరియు సంపన్నమైన భవిష్యత్తు ఉంటుందా? క్రమంగా క్షీణిస్తున్న అమెరికా, ట్రంప్‌ ఏ దేశాన్ని వదిలిపెట్టడం లేదు అని పేర్కొన్నారు. ప్రపంచం అత్యంత సంక్లిష్టమైన అంతర్లీన సంబంధాలతో పెన వేసుకుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక పరిణామాలు, ఎనర్జీ రంగంలో అనేక పునర్వ్యవస్థీకరణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి, ఎస్‌సిఓ, బ్రిక్స్‌లు ప్రపంచ ప్రత్యామ్నాయాలుగా మారాయి. ఈ సంస్థల్లోని దేశాలు డీడాలరైజేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ”ప్రపంచం తీవ్రమైన గందరగోళంలో ఉంది. ప్రపంచ క్రమం కొత్త పరివర్తనలోకి వెళుతుంది. ప్రపంచ పరిపాలన క్రమం కొత్త కూడలికి చేరుకుంది. ఈ సమయంలో చైనా అత్యా ధునిక ఆయుధ వ్యవస్థలతో కూడిన సైనిక కవాతు మానవాళి భవిష్యత్తుకు గొప్ప ప్రాముఖ్యత నిస్తుంది.

చైనా ప్రజలు మానవ నాగరికత ప్రగతి యొక్క సరైన దిశ వైపు దృఢంగా నిలబడతారు. మేము తిరిగి శాంతియుత అభివృద్ధికి పునరంకిత మౌతాం. మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కొరకు ప్రపంచ ప్రజలతో మేము చేతులు కలుపుతాం” అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ లేనిదే ఆధునిక చైనా లేదు. చైనా ప్రజలు మానవ నాగరికత పురోగతి యొక్క చరిత్రకు సరైన వైపు నిలబడ తారు. చైనా శాంతిని ప్రేమించే ప్రపంచ ప్రజలతో కలిసి ప్రపంచశాంతి మరియు అభివృద్ధికై పాటుపడుతుందనీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందాం అని బ్రిక్స్‌ దేశాలకు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ట్రంప్‌ ప్రకటించిన సంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. బ్రిక్స్‌ నేతల సదస్సు సెప్టెంబర్‌ 8న సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో జరిగింది. దీన్ని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూనా డిసిల్వా నిర్వహించారు. ఈ సందర్భంగా జీపింగ్‌ ప్రసంగిస్తూ ఆధిపత్యవాదం, ఏకపక్షవాతం, రక్షణ వాదం రోజురోజుకు పెరుగుతున్నాయని ఇది వాణిజ్య యుద్ధాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా ప్రబల్యానికి వ్యతిరేకంగా ఆయన గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఇనిషియేటివ్‌ (జిజిఐ) ని ప్రతిపాదించారు. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు.

నైనాల గోవర్ధన్‌
97013817199

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -