- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామాలలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలపై గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాలలో ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆవాసు సర్వే, పనుల జాతర పనులు, స్వచ్ఛ సర్వేక్షన్ -25, పారిశుద్ధం పనులపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ దినాకర్, ఉపాధి హామీ ఏపీవో బాలస్వామి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
- Advertisement -