- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
దేవి నవరాత్రుల సందర్భంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని జంబి హనుమాన్ ఆలయం నుండి వివిధ కాలనీలో కొలువు ధీరనున్న దేవి విగ్రహ శోభయాత్ర ప్రారంభమైనవి. పట్టణంలోని జరాయత్ నగర్, చేనేత కాలనీ కి చెందిన వందేమాతరం యూత్ దేవి శోభాయాత్రను ఇ ఆర్ ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. శోభయాత్రలో కాలనీకి చెందిన మహిళలు మంగళహారలతో అమ్మవారి కి స్వాగతం పలికారు. ఈ శోభయాత్రలో వందేమాతరం యూత్ సభ్యులు, కాలానికి చెందిన జిందం నరహరి, ఖాందేశ్ సత్యం, పట్టణ పద్మశాలి అధ్యక్షులు మోహన్ దాస్, ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, సడక్ ప్రమోద్, నూకల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -