- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలో జూపల్లి గ్రామంలోని దుర్గ మాత దేవీ నవరాత్రుల ఉత్సవాలలో మొదటి రోజు పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ రంగినేని శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరికి ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గ మాత కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -