చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య..
నవతెలంగాణ – చండూరు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన బాటలో మనమంతా పయనించాలని చండూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య అన్నారు. శనివారం చండూరు మార్కండేశ్వర ఆలయం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బిక్షమయ్య మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం అంతా కలిసి చౌరస్తాకు వెళ్లి ఆచార్యకొండ లక్ష్మణ్ బాబుజి విగ్రహానికి పూలమాల వేసిన ఇవ్వాలనిపించారు. ఈ కార్యక్రమంలో కోమటి వీరేశం, కోడిగిరి బాబు, గంజి శ్రీను, రావిరాల నగేష్, డాక్టర్. కోడి శ్రీనివాసులు, రాపోలు వెంకటేశం,పున్న బిక్షమయ్య, రాపోలు సత్యనారాయణ, కర్నాటి శ్రీనివాసులు,చిట్టిపోలు వెంకటేశం,అంజయ్య, గోపయ్య, చెరుపల్లి రమేష్,గంజి వెంకటేశం, చెరుపల్లి కృష్ణ,రాపోలు ప్రభాకర్,రాపోలు జగదీశ్వర్,సంగేపు శ్రీనివాసులు, ఏలె శ్రీనివాసులు, కలిమి కొండ మహేష్, గంజి గంగాధర్, గంజి బిక్షం, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన బాటలో పయనించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES