- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఘనపూర్ గ్రామంలో దుర్గామాత వద్ద చండీయాగం& అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో నవరాత్రుల సందర్భంగా దుర్గామాత వద్ద చండీయాగం ,అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ.. పాడిపంట, పిల్లల ఆరోగ్యం, పశువులకు గలీకుంటూ, ఎవరికి ఎటువంటి హాని కలగద్దని వేడుకుంటామని, ఈ చండీయాగంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుండి విజయవంతం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దుర్గా మాత సేవ కమిటీ, వీడీసీ, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
- Advertisement -