హైదరాబాద్ విద్యార్థి మృతి
హైదరాబాద్: అమెరికాలో మరోసారి దారుణం చోటు చేసుకున్నది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీనగర్ పరిధిలోని బి.ఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున డాలస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు.
బి.ఎన్ రెడ్డి నగర్లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి మాజీమంత్రి హరీశ్రావు పరామర్శించారు. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కు పోతోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి
చంద్రశేఖర్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆవేదన కలిగించిందన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు.