డిప్యూటీ సిఈఓ విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని డిప్యూటీ సి ఈ ఓ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరిగిన జడ్పిటిసీ,ఎంపీటీసీ ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలింగ్ రోజు పీవో,ఏపీవోలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,శిక్షణలో ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ ముందు రోజు,పొలింగ్ రోజు ఇచ్చే ఫారాలు,నివేదికలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రోజు జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆంజనేయులు,జడ్పిటిసీ అర్ ఓ,జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి సత్యాంజనేయ ప్రసాద్,ఎన్నికల శిక్షణ అధికారులు దూడల వెంకటేష్,ఎం తిరుపతిరెడ్డి,ఎంపీటీసీ ఆర్వోలు కరుణాకర్ రెడ్డి,విజయ్,శ్రీనివాస్ మండలంలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES