Wednesday, October 8, 2025
E-PAPER
HomeNewsగ్రూప్‌-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

గ్రూప్‌-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

- Advertisement -

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్‌

గ్రూప్‌-1 నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అంద జేసినా వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కులేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందని ఆమె తెలిపారు. అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో సుప్రీంకోర్టు ఎత్తి చూపినట్టేనని పేర్కొన్నారు. గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్‌ ఆన్సర్‌ షీట్లను తొందరపడి డిస్పోజ్‌ చేయొద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పులు చేసిందనీ, ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను తుంగలో తొక్కిందని విమర్శించారు. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్‌ ఆన్సర్‌ షీట్లను డిస్పోజ్‌ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -