- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
హైదరాబాద్లోని బస్సు భవాన్ ముట్టడికి వెళ్తున్న జన్నారం బీఆర్ఎస్ నాయకులను బుధవారం తెల్లవారుజామునే జన్నారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్ మాజీ మండల వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అన్నారు. గతంలో ఎన్నో అరెస్టుల ద్వారానే తెలంగాణ సిద్ధించిందన్నారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాగుల శంకర్ బాలసాని శ్రీనివాస్ రాకేష్, లక్ష్మణ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -