నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ జూలోని 125 ఏళ్ల వయసున్న ఓ మగ తాబేలు మృతి చెందింది. ఈ గాలాపాగోస్ జెయింట్ తాబేలును 1963లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి జూ పార్క్కు తరలించారు. అయితే, ఇది కొంతకాలంగా అనారోగ్యంతో ఉందని జూ పార్క్ అధికారులు తెలిపారు. పలు అవయవాలు విఫలం కావడంతో తాబేలు మరణించినట్టు పోస్ట్మార్టంలో తేలిందన్నారు. పరిశోధనల కోసం తాబేలు శాంపిల్స్ను రాజేంద్రనగర్లోని వీబీఆర్ఐ అండ్ వెటర్నరీ కాలేజీకి పంపామని చెప్పారు.