స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం…

నవతెలంగాణ – వికారాబాద్: వికారాబాద్‌ జిల్లా సూల్తాన్‌పూర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనంలోని 40 మంది విద్యార్థులను కాపాడారు. స్టీరింగ్‌ పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపారు.

Spread the love