మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదు

నవతెలంగాణ – వరంగల్: మంత్రి సత్యవతి రాఠోడ్​పై వచ్చింది.. దీంతో గూడూరు పోలీస్ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..? మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంగరగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌ నాయక్​కు మద్దతుగా ప్రచారానికి వెళ్లిన మంత్రికి స్థానిక మహిళలు మేళతాళాలు, డప్పచప్పుళ్లు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అయితే మంత్రి.. మంగళహారతిలో నాలుగు వేల రూపాయలను ఉంచారు. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె డబ్బు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంత్రి సత్యవతి రాఠోడ్​పై కేసు నమోదు చేశారు.

Spread the love