నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్వర్క్ భారత్ సహా, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు వెల్లడించారు.