టీఎన్జీవోస్‌ అధ్వర్యంలో ముజీబ్‌కి ఘన సన్మానం

Under TNGOS Great tribute to Mujeeb– ముజీబ్‌కు ‘భారత్‌ కే అన్మోల్‌’ బిరుదు ప్రదానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ది న్యూస్‌ యూ లైక్‌’ ఆంగ్ల మ్యాగజైన్‌ తరపున మహమ్మద్‌ నిజాముద్దీన్‌, గ్లోబల్‌ పీస్‌ అంబాసిడర్‌ ఆధ్వర్యంలో టీఎన్జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు, అసద్‌ అన్వర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ సయ్యద్‌ మాజీదుల్లా హుస్సేని(ముజీబ్‌)కి భారత్‌ కే అన్మోల్‌ బిరుదు గత నెలలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ న్యూఢిల్లీ ప్రదానం చేశారు. అనివార్య కారణాల వల్ల డాక్టర్‌ ముజీబ్‌ న్యూఢిల్లీకి వ్యక్తిగతంగా వెళ్లలేకపోయారు. ఈనెల 15న స్వాతంత్య్ర దిన్సోతవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక సలహాదారులు ఏ.కె.ఖాన్‌ చేతుల మీదుగా ఆ బిరుదును అందుకున్నారు. ఈ శుభ సందర్భంలో టీఎన్జీవోస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి విక్రమ్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గృహకల్ప కార్యాలయంలో తెలంగాణ కేంద్ర సంఘ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, సహ అధ్యక్షులు మొహమ్మద్‌ నజీర్‌, ప్రచార కార్యదర్శి శైలజ సమక్షంలో డాక్టర్‌ ముజీబ్‌ని వివిధ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ముజీబ్‌ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి తనకు ప్రతిష్టాత్మకమైన బిరుదు ఇవ్వడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. దానంలో కల్లా గొప్పది అన్నదానం అని.. దానికి ప్రతిఫలంగా తనకు అవార్డులు రావడం తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఉద్యోగుల సహకారమేనని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కోశాధికారి జె.బాలరాజ్‌, అసోసియేట్‌ అధ్యక్షులు కె.ఆర్‌.రాజ్‌ కుమార్‌, సభ్యులు ఉమర్‌ ఖాన్‌, కె.శ్రీనివాస్‌, మొహమ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌, నరేష్‌ కుమార్‌, వైదిక్‌ శాస్త్ర, ఖాలీద్‌ అహ్మద్‌, బొల్లిగిద్ద శంకర్‌, సుజాత, గీతాసింగ్‌, శ్రీధర్‌ నాయుడు, ముఖీం ఖురేషి, జహంగీర్‌ అలీ, మహమ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌, మహమ్మద్‌ ముస్తఫా, ఉస్మాన్‌ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి, రోహిత్‌ కుమార్‌, మాజీ సభ్యులు ప్రభాకర్‌, దేవేందర్‌ పాల్గొన్నారు.

Spread the love