గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నవతెలంగాణ -గాంధారి 
గాంధారి మండలంలోని అన్ని గ్రామాల్లో అన్నితాండాల్లో కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాలు తండాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాంధారి మండల కేంద్రంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మరియు కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పురాజు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ చేతు గుర్తుకు ఓటు వేసి మదన్ మోహన్ ను గెలిపించాలని కోరారు. భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Spread the love