క‌ల్యాణ్ రామ్ మూవీ సెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : హీరో నంద‌‌మూరి క‌ల్యాణ్ రామ్‌, ప్ర‌దీప్ చిలుకూరి కాంబోలో వ‌స్తున్న మూవీ కోసం వేసిన సెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో సుమారు రూ. 4 కోట్ల మేర న‌ష్టం జ‌రిగింద‌ని స‌మాచారం. ఇన్వెస్టిగేటివ్ యాక్ష‌న్ ఎంట‌ర్టయిన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సీబీఐకి సంబంధించిన స‌న్నివేశాలు చాలా కీల‌కం. వాటి కోసం చిత్రం యూనిట్‌ ప్ర‌త్యేక‌మైన భారీ సెట్ వేసింది. మొత్తం 10 రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే, తొమ్మిది రోజుల షూటింగ్ పూర్తి కాగా, మ‌రో రోజు షూటింగ్ మిగిలి ఉండ‌గానే ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ సెట్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిన త‌ర్వాత రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించేలోపే సెట్ మొత్తం కాలి బూడిదైపోయింద‌ట‌. కాగా, ఈ మూవీలో సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కూడా కీరోల్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Spread the love