హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ మోసం

నవతెలంగాణ హైదరాబాద్: గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఆదివారం సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. పెట్టిన సొమ్ముకు ఐదు నెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేశ్.. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.

Spread the love