నవతెలంగాణ హైదరాబాద్: భారత్ రైస్(Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రయివేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం నాఫెడ్ ద్వా రా గ్రేటర్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయాలు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్టు నాఫెడ్ అధికారులు తెలిపారు. తెలంగాణలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రచారం లేకపోవడంతో భారత్ రైస్ అమ్మకాలు ఊపందుకోలేదు. తెలంగాణలో అయిదు వేల క్వింటాళ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు వెయ్యి క్వింటాళ్లను పంపిణీ చేశామని నాఫెడ్ అధికారి వినయ్కుమార్ తెలిపారు.
పంపిణీ కేంద్రాలు..
1. ఏపీ రైస్ స్టోర్స్, మెట్టుగూడ 2. చంద్రమౌళి ట్రేడర్స్, కార్వాన్ 3. ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్, ఎస్ఆర్నగర్ 4. డింగ్డాంగ్ సూపర్ మార్కెట్ 5. గౌతమ్రైస్ డిపో, కాప్రా 6. జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్హౌజ్ 7. మాణిక్య ట్రేడర్స్, ఆర్కే పురం 8. మురళీ కిరణ్ అండ్ జనరల్ స్టోర్స్, పటాన్చెరువు 9. ముత్తయ్య గ్రాండ్ బజార్, శేరిలింగంపల్లి 10. ఖైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్ 11. సాయిదీప్ సూపర్ స్టోర్స్, మెదక్ 12. సిర్వి ట్రేడర్స్, బోడుప్పల్ 13. శంకర్ ట్రేడింగ్ కంపెనీ, సికింద్రాబాద్ 14. శ్రీ గోవిందా ట్రేడర్స్, కాచిగూడ 15. శ్రీ వీరభద్ర ట్రేడర్స్, కవాడిగూడ 16. శ్రీ అంబ ట్రేడర్స్, హైదరాబాద్ 17. శ్రీ బాలాజీ రైస్ డిపో, రాంనగర్ 18. శ్రీ సాయిబాబా రైస్ డిపో, కార్వాన్ 19. సాయిశివ రైస్ ట్రేడర్స్, కర్మన్ఘాట్ 20. శ్రీ సాయి ట్రేడర్స్, కొత్తపేట 21. శ్రీ ట్రేడర్స్, చందానగర్ 22. ఉజ్వల్ ట్రేడర్స్, మల్లేపల్లి 23. ఉప్పు రాజయ్య ట్రేడర్స్, షాపూర్నగర్ 24. రిలయన్స్, దేవరయంజాల్