మేడ్చల్ లో యువకుడి దారుణ హత్య

నవతెలంగాణ ఘట్‌కేసర్‌: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ ‌కారిడార్‌ పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కాలనీకి చెందిన యువకుడు (18), బాలిక (15) మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకుడిని పలుమార్లు మందలించారు. బుధవారం రాత్రి బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. అతడి రహస్య భాగాలపై కారం వేసి మరి కొట్టారు. దాదాపు గంట సేపు చితకబాదడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Spread the love