విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక

నవతెలంగాణ – విశాఖపట్నం: ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక ‘ది వరల్డ్‌’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. అందులోని విదేశీయులు స్థానిక కళాకారులతో సంప్రదాయ నృత్యాలు చేశారు. పోర్టు ఛైర్మన్‌ అంగముత్తు మాట్లాడుతూ.. ‘‘విలాసవంతమైన ‘ది వరల్డ్‌’ క్రూయిజ్‌ నౌక విశాఖ పోర్టులోని అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌లో బెర్తింగ్‌ అయ్యింది. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్‌ టెర్మినల్‌ను గమ్యస్థానంగా మారుస్తాం. ఈ టెర్మినల్‌ను రూ.96 కోట్లతో ప్రపంచంలోనే ప్రత్యేకమైన క్రూయిజ్‌ నౌకల రాకపోకలకు అనువుగా నిర్మించాం. ‘ది వరల్డ్‌’ నౌకలో వచ్చిన విదేశీయులకు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను చూపిస్తాం’ అని తెలిపారు.

Spread the love