సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం

నవతెలంగాణ- తిరుమలగిరి: సీపీఐ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని స్థానిక మల్లీశ్వరి థియేటర్లో నిర్వహించారు. దీనికి సభాధ్యక్షులుగా సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లంల యాదగిరి వ్యవహరించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్ల వెంకట్రెడ్డి హాజరై మాట్లాడుతూ సీపీఐ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, తుంగతుర్తి అభ్యర్థి మందుల సామెల్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని, దానికి భారత కమ్యూనిస్టు పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా సమావేశానికి హాజరైన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామెల్ మాట్లాడుతూ నా యొక్క విజయానికి కమ్యూనిస్టులు సహకరించాలని, అలాగే భవిష్యత్తులో వారిని మరవబోమని వారికి తగిన గౌరవాన్ని కూడా ఇస్తామని ఆయనే అన్నారు. తాను కూడా ముందుగాల కమ్యూనిస్టుని, నాకు ఎర్రజెండ అంటే ప్రేమ అని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బోనగిరి యాదాద్రి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సీపీఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు చాడ చంద్రయ్య, సూర్యాపేట రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మురుగొండ లక్ష్మయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్, యాదాద్రి జిల్లా గీత పనివారాల సంఘం కార్యదర్శి చాపల అంజయ్య, సూర్యాపేట వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఇక్బాల్, తిరుమలగిరి కార్యదర్శి టి శ్రీకాంత్, మోత్కూరు కార్యదర్శి అన్నెపు వెంకట్, నూతనకల్లు కార్యదర్శి తొట్ల ప్రభాకర్, తుంగతుర్తి కార్యదర్శి పాల్వాయి పున్నయ్య,మద్దిరాల కార్యదర్శి ఆకుల లింగయ్య, కనుక అశోక్,ఎల్లంల కొమురెల్లి, సత్తయ్య, జంపాల మల్లయ్య, ఎండి షాహిదా, తిరుమలగిరి మండల అధ్యక్షురాలు ఎల్లంల ఘట్టమ్మ, కనుక నరసమ్మ, జంపాల స్వరూప, ఎండి భయమునిస తదితరులు పాల్గొన్నారు.

Spread the love