నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ అరెస్టు

నవతెలంగాణ-హైదరాబాద్ :  పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్‌, కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గోవా కేంద్రంగా డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ దేశస్థుడు స్టాన్లీని సోమవారం ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Spread the love