ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు సత్కారం

నవతెలంగాణ – నవీపేట్
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన నాగనాథ్ కు శాలువా పూల బోకేతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్, మండల నాయకులు చిన్నోళ్ల కుమార్, సుద్దాల నరేష్, గద్వాల మహిపాల్ పాలెం పోశెట్టి, బబ్లు, శ్రీనివాస్, ప్రసాద్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love