పెద్ద టాక్లీలో సాయి చందా చిత్రపటానికి నివాళులు

– గాయపుని మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు బీఆర్ఎస్ వి అధ్యక్షులు విలాస్
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు సాయి చందా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మెన్ అకాల మరణం చెందడం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ వి అధ్యక్షులు గైక్వాడ్ విలాస్ పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప సూచికంగా డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో గురువారం నాడు సాయి చందా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతునితో కోరుకున్నట్లు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో విలాస్ గైక్వాడ్ కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్. వి ఆధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అహేమద్ హుస్సేన్, గ్రామ వార్డ్ మెంబెర్ దిలీప్ కుమార్, వివో.ఏ మాధవ్, రవి పటేల్, రామ్ గొండ, మరిబా, యాదవ్, హనుమంత్ సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love