భర్తను హతమార్చిన భార్య

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని రెండు రోజుల కింద కులాస్పూర్ గ్రామంలో జరిగిన ఘటన మరువకముందే మళ్లీ న్యాల్కల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య కట్టుకున్న భర్తను శుక్రవారం అర్ధరాత్రి హత్య చేసింది. సిఐ సురేష్ కుమార్  ఎస్ హెచ్ ఓ గంగాధర్ తెలిపిన కథనం ప్రకారం.. భార్య భర్తలు లక్ష్మి, లక్ష్మణ్ 35 ఈ మధ్య వారికి తరచూ గొడవలు జరిగేవి శుక్రవారం రాత్రి కూడా గొడవ జరగడంతో భార్య ఆగ్రహంతో భర్త  తలపై బండరాయితో మోపి హతమార్చింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితురాలని అదుపులోకి తీసుకునీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love