ఆమ్‌ ఆద్మీ కీలక నిర్ణయం.. రాజ్యసభకు ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌  స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమెతోపాటు ఆ పార్టీ నేతలు సంజయ్‌ సింగ్‌, ఎన్డీ గుప్తాలను కూడా ఎగువ సభకు నామినేట్‌ చేస్తున్నట్లు ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలను రెండోసారి కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని పీఏసీ నిర్ణయించింది’ అని ఆప్‌ తెలిపింది.

Spread the love