- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పేట్ బషీరాబాద్ పరిధిలోని మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది మంది అధికారుల బృందం కార్యాలయంలో సోదాలు చేపట్టి వాహనదారుల పత్రాలను పరిశీలించింది. వాహనదారులు నేరుగా వచ్చారా లేదా మధ్యవర్తుల ద్వారా సేవలు పొందుతున్నారా అనే విషయాలపై అధికారులు వివరాలు సేకరించారు. మధ్యవర్తుల వ్యవహారంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
- Advertisement -



