మరణానంతరం దేహ దానాలకు అంగీకారం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని నల్లరాల్ల వాడకు చెందిన న్యాయవాది సావుల రాజమౌళి తన మరణానంతరం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పార్టీవ దేహాన్ని ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం నాయకులు తెలిపారు. మరణానంతరం పార్థివదేహాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోయ్యడ కొమురయ్య ,జిల్లా శాఖ అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య ,జిల్లా సంయుక్త కార్యదర్శి కానుగుల మోహన్  అంగీకార పత్రాలను రాజమౌళి కుటుంబ సభ్యులకు  అందజేశారు.
Spread the love