నవతెలంగాణ:ముత్తారం : మండలం మైందండలో వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించి, మరో మహిళను కారుతో లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు ఎర్రం సురేశ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఒంటరిగా ఉన్న వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించటం తో పాటు అడ్డువచ్చిన వారిపై దాడిచేసిన ఘటనలో సురేశ్ పై ముత్తారం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా రెండు కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో మరో నిందితుడు రేగుల గట్టయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.