కార్యకర్తలే గులాబీ పార్టీకి బలం, బలగం

నవతెలంగాణ పెద్దవంగర:
కార్యకర్తలే గులాబీ పార్టీకి బలం, బలగం అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొరిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కార్యకలాపాలను ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎర్రబెల్లి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, శ్రీరాం సుధీర్, బొమ్మెరబోయిన రాజు, జ్ఞానేశ్వర చారి, సర్పంచ్ గాజుల శోభ ప్రసాద్ రావు, ఎంపీటీసీ సభ్యులు ఎర్ర సబిత, ఏదునూరి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ ముజీబుద్దీన్, మాజీ ఎంపీటీసీ జాటోత్ కమలాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎర్ర వెంకన్న, మంచినీళ్ల నవీన్, ఎడ్ల చిరంజీవి, ఉట్ల వీరారెడ్డి, చిలుక బిక్షపతి, పానుగోత్ ప్రదీప్, కూతురు అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love