అడిషనల్ కలెక్టర్, నూతనంగా ఎస్ఐలకు సన్మానం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాకు నూతనంగా వచ్చి భాద్యతలు స్వికరించిన అడిషనల్ కలెక్టర్ యది రెడ్డి, ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ కు నూతనంగా భాద్యతలు స్వికరించిన ఎస్సై సిలివేరి మహేష్ లకు ఇందల్ వాయి మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ, బీఅర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి పులబోకే శాలువాతో ఘనంగా సన్మానించారు. గతంలో నిజామాబాద్ డివిజన్ అర్డిఓగా విధులు నిర్వహించిన యాదిరెడ్డి నిజామాబాద్ జిల్లాకు అడిషనల్ కలెక్టర్ హోదాలో రావడం జరిగిందని, ఎస్ఐ సిలివేరి మహేష్ నూతనంగా భాద్యతలు స్వికరించడం పాట్లా సన్మానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మోహన్ నాయక్, తెలు విజయ్ కుమార్, కుమార్ నాయక్, బీఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, బిఅర్ఎస్ మండల ఉధ్యక్షులు బీరిష్ శేట్టి, అరటి రఘు, సిహెచ్ దాస్, లక్ష్మారెడ్డి, చందర్ నాయక్, సామాజిక కార్యకర్త పులి సాగర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love