కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదపడినట్లుగా మండల ఎంపిడిఓ శ్యాం సుందర్ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడీనట్లుగా తెలిపారు. ప్రజాప్రతినిధులు సమావేశానికి గైహాజరవడంపై ఎంపిపి అసంతృప్తి వ్యక్తం చేశారు.త్వరలోనే సమావేశం నిర్వహించునట్లుగా ఎంపిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండంపేట ఎంపిటిసి సభ్యురాలు ఏనుగు నాగరాని, ఏఓ సుధాకర్, తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్ పాల్గొన్నారు.