బొప్పిడి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

నవతెలంగాణ-ఆమనగల్:

కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామంలో బుధవారం ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి, రావిచేడ్ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన జీ.రవితో పాటు పలువురు యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా బొప్పిడి వారికి కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి కల్వకుర్తి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు వసంత, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు పవన్, మల్లేష్, బండ లింగం యాదవ్, బాలరాజు, శ్రీశైలం, రాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love