తేజస్వి శ్రీ హత్యకు కారణమైన వారి ఇంటి ముందు ఆందోళన..

– పోలీస్ బందోబస్తుతో సద్దుమణిగిన సమస్య

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఇటీవల జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ప్రేమ పేరుతో తేజశ్రీని హత్యకు కారణమైనటువంటి కుటుంబము ఇంటి ముందూ తేజశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. తేజశ్రీ చనిపోయిన తర్వాత తేజస్వి శ్రీ సావుకు కారణమైనటువంటి వారిపైన కేసు నమోదు కావడంతో అప్పటినుంచి వారు వారి ఇంటికి రాలేక బుధవారము వారింటికి రావడంతో తేజశ్రీ కుటుంబ సభ్యులు తేజశ్రీకి న్యాయం జరిగేంత వరకు వారి ఇంటి తలుపులు తెరవకూడదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో సెక్యూరిటీ నిర్వహించి తేజశ్రీ చావుకు కారణమైన కుటుంబ సభ్యులను ఆందోళన నుంచి తప్పించి వేరే చోటికి తరలించినట్లు తెలుస్తోంది. ఎస్సై తిరుపతి తేజశ్రీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవలసిన ఉంటుందని కుటుంబ సభ్యులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది.
Spread the love