పార్టీలకి అతితంగా రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి: ఏకే పౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ -పెద్దవూర
పార్టీల అతీతంగా రఘువీర్ రెడ్డి ని అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని ఏకే పౌండేషన్ ఛైర్మెన్, ప్రముఖ ఎన్ఆర్ఐ, కాంగ్రెస్ రాష్ట్రనాయకులు కట్టేబోయిన అనిల్ కుమార్ పిలువు నీచ్చారు. శనివారం త్రిపురారం మండలం చెన్నాయుపాలెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం లో పది సంవత్సరాల ఆరాచాక నియంతృత్వ నిరాకుంశత్వా ప్రభుత్వాన్ని మీ ఓటుతో చరమగీతం పాడి ప్రజాపాలన కి నాంది పలికిన యావత్ తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదములు చెబుతున్నానని అన్నారు.గత రెండు దఫాలుగా మతాలతో పేరుతో కులాల పేరుతో ప్రాంతంల పేరుతో రాజకీయం చేస్తున్న బిజెపి పార్టీ భారతదేశ లోని పేద ప్రజల జీవనప్రమాణ స్థాయిని స్థాయిని దిగజార్చినదని అన్నారు.ఇప్పుడు వారికి మీ ఓటు తో చరమ గీతం పాడాలని తెలిపారు.రాష్ట్రంలోలాగానే దేశంలో కూడ ఇందిరమ్మ రాజ్యం రావాలని రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే యువత ఉద్యోగావకాశాలు అందుతాయని అన్నారు.గత 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అజాత శత్రువు గా పేరుగాడించి ఎంతో మందిని వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెలు గా ఎమ్మెల్సీ లుగా తీర్చిదిద్దన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ని నాగార్జున సాగర్ ప్రజలు పార్టీలకి అతితంగా భారీ మెజార్టీ తో గెలిపించి మన ప్రాంత గళాన్ని పార్లమెంట్ లో గర్వాంగా వినిపించలంటే హస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మైలారుశెట్టి సైదయ్య, మాజీ సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు,సింగల్ విండో డైరెక్టర్ నూనె చెన్నాలు, గ్రామ శాఖ అధ్యక్షులు నూనె చినవీరయ్య,కొనకంచి వీరభద్రయ్య, పద్మ,, గుడిపాటి పెద్ద వెంకన్న, కృష్ణయ్య, ఉమ, వీరమ్మ,వెంకటేష్, దాస్,సైదులు గౌడ్, మన్నెం కోటి, రావుల రాంబాబు యాదవ్, శేఖర్ గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love