నవతెలంగాణ-కేయూ క్యాంపస్
రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరిని రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల భవనం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1356 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులనూ పర్మినెంట్ చేయాలని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో- చైర్మెన్ జరుపుల చందూలాల్, నాయకులు డాక్టర్ ఉషారాణి, డాక్టర్ శ్రీదేవి, శ్రీలత, డాక్టర్ సురేష్, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీధర్ రావు, డాక్టర్ పుల్లా రమేష్, డాక్టర్ సదానందం, డాక్టర్ దాస్, డాక్టర్ మంజుల, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.